ఏపీలో అకాల వర్షాలతో తలెత్తిన నష్టంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నష్టం అంచనా వేసేందుకు పలు మంత్రిత్వ శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ కుమార్ సింగ్ నేతృత్వం వహించనున్నారు.
పంటనష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో పర్యటించనున్న కేంద్ర బృందం - heavy rains in ap
అకాల వర్షాలతో తలెత్తిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో పలు మంత్రిత్వ శాఖల అధికారులను భాగస్వామ్యులగా చేర్చింది. త్వరలోనే ఈ కమిటీ ఏపీలో పర్యటించనుంది.
![పంటనష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో పర్యటించనున్న కేంద్ర బృందం central-commite-formation-on-flood-damage-in-andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9297039-962-9297039-1603535834435.jpg)
పంటనష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో పర్యటించనున్న కేంద్ర బృందం
కమిటీలో వ్యవసాయం, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఉండనున్నారు. త్వరలోనే ఏపీలో ఈకమిటీ పర్యటించనుంది.