ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ లైఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇన్ఫోసిస్ అవార్డులు అందిస్తుంటుంది. ఈ క్రమంలో బాక్టీరియాలో సెల్ వాల్ ఎదుగుదలపై డాక్టర్ మంజుల చేసిన పరిశోధనలకుగానూ ఆమె ఎంపికయ్యారు. కొత్త యాంటీ బయోటిక్స్ తయారీలో ఈ పరిశోధనలు కీలక పాత్ర పోషించనున్నాయి. అవార్డులో భాగంగా విజేతలకు బంగారు పథకంతో పాటు నగదు బహుమతిని ఇవ్వనున్నారు.
ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్
బాక్టీరియా సెల్ వాల్ ఎదుగుదలకు సంబంధించి చేసిన కృషికి... సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డా.మంజులా రెడ్డి 2019 ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఇన్ఫోసిస్ అవార్డుకు ఎంపికైన సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్