తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2021, 5:46 PM IST

ETV Bharat / state

'సీసీ కెమెరాల ద్వారా నేరాలను త్వరగా పరిష్కరించవచ్చు'

కూకట్​పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్, ఆంజనేయనగర్ కాలనీల్లో సీసీ కెమోరాలను ఏర్పాటు చేశారు. వీటిని డీసీపీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు.

mla madhavaram krishna rao
సీసీ కెమోరాల ఏర్పాటు

కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల సమస్యలకు త్వరగా చెక్ పెట్టవచ్చని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆయన కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ డివిజన్, ఆంజనేయనగర్ కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టడంతో పాటు.. నేరాలను త్వరగా పరిష్కరించవచ్చన్నారు. దీనికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ శిరీష బాబుకి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి:ఇళ్లైనా, పెళ్లైనా తెరాసతోనే సాధ్యం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details