తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర బడా నేతల బండారంపై సీబీఐ విచారణ జరగాలి.. - కబ్జాదారులకు తెరాస ప్రభుత్వ యంత్రాంగం అండ

ఓయూ భూముల వ్యవహారంలో కేంద్ర బడా నేతల బండారం.. బయటపడాలంటే సీబీఐ దర్యాప్తుకు ప్రతిపాదించాలన్నారు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి. విశ్వవిద్యాలయంలో కేంద్ర, రాష్ట్ర పెద్దల అండతో భూకబ్జా బాగోతం నడుస్తోందని ఆరోపించారు. న్యాయపరంగా అధికారికంగా చర్యలు తీసుకుని విశ్వవిద్యాలయానికి ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.

CBI probe into OU land deal
కేంద్ర బడా నేతల బండారంపై.. సీబీఐ విచారణ జరగాలి..

By

Published : May 24, 2020, 9:36 AM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేంద్ర, రాష్ట్ర పెద్దల అండతో భూకబ్జా బాగోతం నడుస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. తెరాస కార్పొరేటర్ భర్త మణికేశ్వర్‌నగర్‌లో ఓయూ సెంటర్ ఫర్ డివోషనల్ స్టడీస్ కి చెందిన 2వేల గజాల భూమి కబ్జాకు ప్రయత్నిస్తే.. భాజపా కేంద్ర బడా నేతల అండతో 8వేల గజాలకు పైగా కబ్జా బాగోతం నడుస్తోందని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు.

ప్రహరీ గోడ నిర్మించాలి

కబ్జాదారులకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. దీనిని అడ్డుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాలతో కబ్జాలను వ్యతిరేకిస్తున్న అధ్యాపకులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. భూకబ్జాల బాగోతాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. న్యాయపరంగా అధికారికంగా చర్యలు తీసుకుని విశ్వవిద్యాలయానికి ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:వలస కూలీలను పంపేందుకు చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details