హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఈటీవీ-ఈనాడు సంయుక్తంగా ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించింది. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్సా టెక్ మహీంద్రా స్మార్ట్ వృత్తి శిక్షణ కేంద్రం నేతృత్వంలో స్థానిక యువత ఈ కార్యక్రమం చేపట్టింది. రాజకీయ పార్టీల ప్రలోభాలకు గురికాకుండా విద్యావంతులను ఎన్నుకోవాలని పేర్కొన్నారు.
'నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి' - MUSHEERABAD CONSTITUENCY
ఓట్ల పండగ వేళ పోలింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. మహీంద్రా సంస్థతో కలిసి ఈటీవీ-ఈనాడు అవగాహన ర్యాలీ చేపట్టింది.
రాజకీయ పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ఓటేయాలి : ఓటర్లు