హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ దాడిలో రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా నిమ్మలూరి శ్రీహరి, అవూరి పాండరిపై అనుమానం వచ్చి సోదాలు చేశారు. వీరి వద్ద రెండు బ్యాగుల్లో ఉన్న రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. పట్టబడ్డ డబ్బు జయభేరి సంస్థకు చెందినదిగా గుర్తించారు. రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఎంపీ మురళీ మోహన్పై కూడా కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.
హైటెక్సిటీలో 2 కోట్లు స్వాధీనం.. ఎంపీపై కేసు నమోదు - case-on-MP muralimohan
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్ముర తనిఖీలను చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. రాత్రి హైటెక్ సిటీలో రూ.2 కోట్ల నగదు పట్టుకున్నారు. ఈ డబ్బును ప్రముఖ సినీ నటుడు, ఎంపీ మాగంటి మురళీ మోహన్కు ఇచ్చేందుకు తీసుకెళ్తునట్లు పోలీసులు వెల్లడించారు.
![హైటెక్సిటీలో 2 కోట్లు స్వాధీనం.. ఎంపీపై కేసు నమోదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2900705-425-8dad4027-7df6-4f6a-abcb-deebae0f9e2a.jpg)
భారీ మొత్తంలో నగదు
TAGGED:
case-on-MP muralimohan