రేపు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అశ్విన్స్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్, జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన నడకను నిర్వహించారు. కేబీఆర్ పార్క్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు సాగింది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదని వైద్యులు తెలిపారు. కెన్ ఐ కెన్ అనే క్యాన్సర్ సపోర్ట్ గ్రూపును ప్రారంభించారు. పొగాకు వల్ల వ్యాధి వస్తుందని వాటికి యువత దూరంగా ఉండాలని నిర్వాహకులు సూచించారు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటించడం వల్ల క్యాన్సర్ నుంచి రక్షించుకోవచ్చని వైద్యులు పేర్కొన్నారు.