గులాబ్ తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటి గమ్యాలు కుదించడం, మరి కొన్ని దారిమళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఇవాళ విశాఖ, విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు.., విశాఖ, విజయనగరం వైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. 27న విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేశారన్నారు. ఈ నెల 26న పూరీ-ఓఖా ప్రత్యేక రైలును వయా ఖుర్థారోడ్, అంగూల్, సంబల్పూర్ మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. 27న విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్రత్యేక రైలును జగదల్పూర్లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల 28న జగదల్పూర్ నుంచి బయలు దేరుతుందన్నారు. పలు సాంకేతిక కారణల వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.
ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు