తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం బంద్​ : ఎస్​ఈసీ - sec parthasarathy latest news

sec parthasarathy, telangana pura election news
'ఎన్నికల వేళ కొవిడ్​ నియమాలు తప్పనిసరి'

By

Published : Apr 22, 2021, 4:55 PM IST

Updated : Apr 22, 2021, 5:38 PM IST

16:50 April 22

పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం బంద్​ : ఎస్​ఈసీ

రాష్ట్రంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై ఎస్​ఈసీ నిషేధం విధించింది. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ఆపాలని స్పష్టం చేసింది. 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎస్‌ఈసీ పార్థసారథి సూచించారు. కొందరు నేతలు, అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని... ఆ ఉల్లంఘనలతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇప్పటికే పలువురు కాంగ్రెస్​ నేతలు కరోనా వ్యాప్తి వేళ ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ తరుణంలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే సీఎం కేసీఆర్​దే బాధ్యత అని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు.

ఇదీ చూడండి :పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

Last Updated : Apr 22, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details