తెలంగాణ

telangana

ETV Bharat / state

balkampet yellamma: కన్నుల పండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్​లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్​ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకకు జంట నగరాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి.. అమ్మవారిని దర్శించుకున్నారు.

balkampet yellamma
balkampet yellamma

By

Published : Jul 13, 2021, 12:01 PM IST

Updated : Jul 13, 2021, 4:25 PM IST

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జ‌రిగింది. ఈ క‌ల్యాణ మ‌హోత్సవాన్ని తిల‌కించేందుకు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. అమ్మవారికి మొక్కులు స‌మ‌ర్పించుకున్నారు. మంత్రులు ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్.. ప్రభుత్వం తరఫున ఎల్లమ్మకు ప‌ట్టు వస్త్రాలు స‌మ‌ర్పించారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌ల్యాణ వేడుక‌ను నిర్వహించారు.

హైదరాబాద్‌లో ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం వైభవంగా సాగింది. ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎల్లమ్మ అమ్మవారికి శివసత్తులు పుట్ట బంగారాన్ని సమర్పించారు. అమ్మవారి క‌ల్యాణాన్ని తిల‌కించేందుకు మంత్రులు కుటుంబ స‌మేతంగా వ‌చ్చారు. గతేడాది కరోనా కారణంగా ఆలయం లోపలే కల్యాణం నిర్వహించారు. కొవిడ్​ కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఈసారి ప్రభుత్వం.. ఆలయ బయట భారీ ఏర్పాట్లు చేసింది.

జంట నగరాల నుంచి పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. కొవిడ్ కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని ప్రభుత్వం సూచించింది. కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్‌ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

కల్యాణ మహోత్సవం నిన్న ఎదుర్కోళ్లతో ప్రారంభమవగా... ఇవాళ ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం జరిగింది. రేపు రథోత్సవంతో ఉత్సవం వైభవంగా ముగియనుంది.

ఇదీ చూడండి:balkampeta: ఈసారి ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

Last Updated : Jul 13, 2021, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details