RS Praveenkumar on TSPSC Paper Leakage Issue : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను 48గంటల్లోగా రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. త్వరలో ఈ వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తానన్న ప్రవీణ్కుమార్... రాష్ట్రపతికి కూడా లేఖ రాస్తానన్నారు. స్వచ్ఛందంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి జనార్దన్ రెడ్డి వైదొలగాలని కోరారు.
పేపర్ లీకేజీపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు : జనార్దన్ రెడ్డి హాయాంలో జరిగిన పరీక్షలన్నీ రద్దు చేసి.. తిరిగి నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారని ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ తెలంగాణ ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని ప్రవీణ్కుమార్ అన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వంద మార్కులు దాటిన అభ్యర్థుల వివరాలు బహిర్గత పరచాలని కోరారు. సెక్రటరీ పీఏకు ఎలా కాన్ఫిడెన్షియల్ రూం యాక్సెస్ లభించిందని... టెక్నికల్ సమస్యగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేసి... సిట్కి అప్పగించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
'టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి నుంచి జనార్దన్ రెడ్డి వైదొలగాలి. పేపర్ లీకేజీపై కేసీఆర్ మౌనంగా ఉన్నారు. లీకేజీపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయట్లేదు. జనార్దన్ రెడ్డి హయాంలో జరిగిన పరీక్షలన్నీ రద్దు చేయాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 100 మార్కులు దాటినవారి వివరాలు వెల్లడించాలి. కేసును సిట్కి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. తక్షణమే ఛైర్మన్, కమిషన్సభ్యులను తొలగించాలి.'-ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు