BSF Defuse Landmines in AOB: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను స్వాధీనం చేసుకుని బీఎస్ఎఫ్ బలగాలు వాటిని నిర్వీర్యం చేశాయి. ఏవోబీలోని మల్కన్గిరి జిల్లా కటాఫ్ ఏరియాలో కొత్తగా ఏర్పాటైన బీఎస్ఎఫ్ బెటాలియన్ గొప్ప విజయాన్ని సాధించింది.
BSF Defuse Landmines in AOB: ఏవోబీలో మందుపాతరలు నిర్వీర్యం చేసిన బీఎస్ఎఫ్ బలగాలు - తెలంగాణ వార్తలు
BSF Defuse Landmines in AOB: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను బీఎస్ఎఫ్ బలగాలు నిర్వీర్యం చేశాయి. సరిహద్దుల్లోని ఖొరిగండి అటవీప్రాంతంలో భారీగా మందుపాతరలు, మావోయిస్టు సామగ్రిని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.
![BSF Defuse Landmines in AOB: ఏవోబీలో మందుపాతరలు నిర్వీర్యం చేసిన బీఎస్ఎఫ్ బలగాలు BSF Defuse Landmines in AOB, bsf](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14134318-499-14134318-1641653695987.jpg)
బీఎస్ఎఫ్ బలగాలు.. కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆంధ్రా సరిహద్దుల్లోని ఖొరిగండి అటవీప్రాంతంలో గొయ్యిని తవ్వి పెద్ద ఎత్తున నిల్వ చేసిన మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 అతిపెద్ద మందుపాతరలు, ఇతర సామగ్రి ఉన్నాయి. మావోయిస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం బీఎస్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అదీ చదవండి:Traffic at Hyderabad-Vijayawada Highway : సెలవులొచ్చాయ్.. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ