BRS Presentation On KCR Govt Rule 2014-23 :రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనపై 'స్వేదపత్రం' పేరిట తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసేలా కొంత ప్రయత్నం చేసిందని ఆరోపించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, చివరకు వాయిదా వేసుకొని పోయారని మండిపడ్డారు. అందుకే బాధ్యత గల పార్టీగా 'స్వేద పత్రం' విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పామని పేర్కొన్నారు.
"రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని రంగాల్లోనూ తెలంగాణపై వివక్ష నెలకొంది. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సాకారమైంది. ఇప్పుడు కొందరు తమ వల్లనే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారు. ఉద్యమంలో విరిగిన లాఠీలు, పేలిన బుల్లెట్లకు లెక్కలేదు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ప్రయోగం విఫలం అవుతుందని కొందరు విమర్శించారు. తొలినాళ్లలోనే కొందరు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారు."- కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR Presentation On BRS Govt Nine and Half Year Rule :కోట్లమంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే స్వేద పత్రంపై ప్రెజంటేషన్ ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పారు. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని వెల్లడించారు. తెలంగాణ ఆకాశమంత ఎత్తులో అగ్ర రాష్ట్రంగా ఉందన్న కేటీఆర్ రాష్ట్రానికి అస్థిత్వమే కాదు ఆస్తులు కూడా సృష్టించామని వివరించారు.
రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు : కేటీఆర్
KTR On TSRTC Development : ఆర్టీసీకి ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకొని అప్పులు తెచ్చుకుంటే కేసీఆర్ను బద్నాం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవాళ ఆకాశం అంత ఎత్తున ఉందన్న కేటీఆర్ ఆస్తులనే కాదు తెలంగాణ అస్తిత్వాన్ని కూడా కేసీఆర్(KCR Government Development) నేతృత్వంలోని ప్రభుత్వం సృష్టించిందని వెల్లడించారు. 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్కు ఎంత వెల కడతారని ప్రశ్నించారు.