BRS Protests Today and Tomorrow on Cooking Gas Hike: గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఇవాళ, రేపు నిరసన తెలపనున్నారు. సిలిండర్ ధర పెంపుతో ప్రజల ఇబ్బందులను.. కేంద్రానికి తెలిసేలా విభిన్న రీతుల్లో కార్యక్రమాలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
BRS Protests Today and Tomorrow in Telangana: ప్రజలను ముఖ్యంగా మహిళలను భాగస్వామ్యం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. మహిళ దినోత్సవం కానుకగా మోదీ సిలిండరు ధరలు పెంచారన్న నినాదాన్ని ప్రజల్లోకి బీఆర్ఎస్ తీసుకెళ్లనుంది.
'రోడ్ల పక్కన చిన్న చిన్న హోటెల్ పెట్టుకొని, వ్యాపారాలు చేసుకునేవారు. దేశంలో వారికి రూ.50, రూ.350 పెంచడం అంటే చిన్న అంశంగా కావచ్చు. కానీ ఈ దేశంలో అదానీ, అంబానీలే కాదు. ఆప్ కూడా పేదవాళ్లు ఉన్నారు. వాళ్ల బతుకుదెరువు కూడా ఈ పని మీదే వెలదీసున్నారనే విషయాన్ని బీజేపీ గ్రహిస్తే మంచిదచని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను'. -సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి