తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళలపై అఘాయిత్యాలు మద్యం దుకాణాలే కారణం..' - బౌద్ధ సంఘం తాజా వార్త

రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం వల్లనే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని బౌద్ధ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు నర్సింగ్​రావు అన్నారు. హైదరాబాద్​ అబిడ్స్​లో బౌద్ధ సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.

boudha sangh meeting in Hyderabad
'మద్యం దుకాణాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి'

By

Published : Jan 3, 2020, 5:07 PM IST

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంపై ఉన్న శ్రద్ధ, రాష్ట్ర ప్రజల సంక్షేమంపై లేదని భారతీయ బౌద్ధ సంఘం ఆరోపించింది. రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసివేస్తూ... మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారంటూ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు నర్సింగ్​రావు మండిపడ్డారు.

హైదరాబాద్ ​అబిడ్స్​లోని సంఘం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీలో మద్యం అమ్మకాలను నియంత్రిస్తుంటే... తెలంగాణలో మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. మద్యం వల్లనే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.

ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలు మద్యానికి బానిసలుగా మారుతూ... వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ చట్టం తీసుకురావాలని ... లేనిపక్షంలో మహిళలను ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

'మద్యం దుకాణాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి'


ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details