సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంతం... రాష్ట్రం ఏర్పడ్డాక సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రముఖ రచయిత్రి సులోచనాదేవి రాసిన 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండ్ తెలంగాణ బిఫోర్ ఎండ్ ఆఫ్టర్ బైఫర్కేషన్' అనే పుస్తకాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలోని మంత్రి ఛాంబర్లో ఆవిష్కరించారు.
సులోచనాదేవి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి - hyderabad ravindra bharathi latest news
హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్గౌడ్... ప్రముఖ రచయిత్రి సులోచనాదేవి రాసిన 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండ్ తెలంగాణ బిఫోర్ ఎండ్ ఆఫ్టర్ బైఫర్కేషన్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు రాయాలని మంత్రి ఆకాంక్షించారు.
![సులోచనాదేవి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి book release in hyderabad ravindra bharathi by minister srinivas goud](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9347115-158-9347115-1603900262275.jpg)
సులోచనాదేవి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి
సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి పరిస్థితులు ఏంటీ? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ స్థితిగతులు ఎలా మారాయి? అనే అంశాలను రచయిత్రి సులోచనాదేవి చక్కగా వివరించారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై భవిష్యత్తులో మరో మంచి పుస్తకం రాయాలని కోరారు.
ఇదీ చూడండి:అధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్