తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా 'యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు' పుస్తకావిష్కరణ - సోమాజిగూడ ప్రెస్ క్లబ్​ తాజా వార్తలు

హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్​క్లబ్​లో జెసికె లా ఆసోసియేట్స్​ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ చంద్రకుమార్​ రాసిన 'యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు' పుస్తకాన్ని విశ్రాంత సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్​రెడ్డి ఆవిష్కరించారు.

book launch by justice sudarshan reddy at hyderabad
ఘనంగా 'యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు' పుస్తకావిష్కరణ

By

Published : Oct 21, 2020, 8:48 PM IST

విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ చంద్రకుమార్​ రాసిన 'యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్రాంత సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్​రెడ్డి ఆవిష్కరించారు. జెసికె లా అసోసియేట్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ జస్టిస్​ చంద్రయ్య, జస్టిస్​ వెంకటేశ్వరరెడ్డి, జస్టిస్ వామనరావు, జస్టిస్ యతిరాజులతో పాటు కేంద్ర సమాచార పూర్వ కమిషనర్​ మాడభూషి శ్రీధర్​ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాది వృత్తిలోకి వచ్చే వారికి కావాల్సిన అన్ని అంశాలతో పాటు నేటి సమాజంలో ఉన్న అన్ని కోణాలను జస్టిస్​ చంద్రకుమార్​ ఈ పుస్తకంలో పొందుపరిచారని పలువురు న్యాయమూర్తులు తెలిపారు. కోర్టులో న్యాయవాది వాదించి గెలవడమే కాకుండా సమాజంలోని వారికి సరైన న్యాయసలహాలు ఇవ్వడం మంచి న్యాయవాది లక్షణమన్నారు.

ఇదీ చదవండిఃహైదరాబాద్​లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details