తెలంగాణ

telangana

By

Published : Oct 20, 2020, 1:18 PM IST

ETV Bharat / state

పోలీసుల సేవలు అజరామరం: సీపీ అంజనీ కుమార్

పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వారమంతా హైదరాబాద్​ నగర పోలీసులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గోశామహల్​ ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

blood donation camp in Hyderabad
గోశామహల్​లో రక్తదాన శిబిరం.

పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​ గోశామహల్​లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర సీపీ అంజనీ కుమార్​ శిబిరాన్ని ప్రారంభించారు. గోశామహల్ ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వందకుపైగా పోలీసు అధికారులు రక్తదానం చేశారు.

అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వారమంతా సిటీ పోలీసులు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు. బుధవారం రోజు గోశామహల్ మైదానంలో జరగనున్న పెరేడ్​లో హోంమంత్రి పాల్గొననున్నట్లు వెల్లడించారు. రక్తదాన శిబిరం ఏర్పాటుకు సహకరించిన నిలోఫర్ ఆసుపత్రి సిబ్బందికి అంజనీ కుమార్ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details