ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుయుక్తులు పన్నినా గ్రేటర్ పీఠం భాజపాదేనని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలో లక్ష రెండు పడక గదుల ఇళ్లను నిర్మించామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడతామన్నారు.
హిమాయత్నగర్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరిన మహాలక్ష్మి గౌడ్కు మద్దతుగా... చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. దుబ్బాకలో ఉపఎన్నిక ఫలితమే గ్రేటరలోనూ పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు.