మేడారానికి 2 వందల కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి మాయమైన కేసీఆర్... మళ్లీ ఏ ముఖం పెట్టుకుని జాతరకు వస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈ జాతరకు 98 కోట్లు కేటాయిస్తే... అధికార పార్టీ నేతలు దండుకుంటున్నారని ఆరోపించారు.
'పండుగల పేరుతో దోచుకునే సంస్కృతి తెరాసదే' - kcr news
హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ శ్రేణులు మేడారం జాతరకు వెళ్లారు. ఇవాళ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెరాస పండుగుల పేరుతో దోచుకుంటుందని ఆరోపించారు లక్ష్మణ్.

'పండుగల పేరుతో దోచుకునే సంస్కృతి తెరాసదే'
పండుగల పేరుతో దోచుకునే సంస్కృతి తెరాస తెరలేపిందని మండిపడ్డారు. నలుగురు కలెక్టర్ల మార్పు దీనికి అద్దం పడుతుందన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం నుంచి పది వాహనాల్లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు మేడారం జాతరకు బయలుదేరారు. సమ్మక్క, సారలమ్మలను లక్ష్మణ్తో పాటు పార్టీ శ్రేణులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
'పండుగల పేరుతో దోచుకునే సంస్కృతి తెరాసదే'
ఇదీ చూడండి :మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..