తెలంగాణ

telangana

By

Published : Dec 12, 2019, 1:12 PM IST

ETV Bharat / state

'కేసీఆర్​ది బార్​ బచావో.. బార్​ బడావో నినాదం'

దిశ ఘటన తర్వాత మద్యంపై సర్వత్రా చర్చ నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. భాజపా మహిళ సంకల్ప దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరారు. హైదరాబాద్​ బ్రాండ్​ అంటూ ట్వీట్​ చేస్తున్న కేటీఆర్​.. బ్రాందీ హైదరాబాద్​గా మార్చారని మండిపడ్డారు.

bjp state president laxman says that liquor should be banned in telangana to prevent crime
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

భవిష్యత్​లో ఏ తల్లి కడుపు కోతకు మద్యం కారణం కాకూడదని భాజపా రాష్ట్ర అధ్యక్షడు లక్ష్మణ్​ అన్నారు. కేంద్రంలో మోదీ 'బేటీ బచావో-బేటీ పడావో' అంటుంటే రాష్ట్రంలో కేసీఆర్​ 'బార్​ బడావో-బార్​ బచావో' అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.

మద్యం నియంత్రణ శాఖను.. మద్యం పెంచే శాఖగా మార్చారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో పబ్​, క్లబ్​ కల్చర్​ తల్లిదండ్రుల పాలిట గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ బ్రాండ్​ అంటూ ట్వీట్​ చేస్తున్న కేటీఆర్​.. బ్రాందీ హైదరాబాద్​గా మార్చారని మండిపడ్డారు.

సామాజిక బాధ్యతగా సీఎం కేసీఆర్​ మద్యం నిషేధించాలని లక్ష్మణ్​ కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం డీకే అరుణ దీక్ష చేయడం లేదని స్పష్టం చేశారు. అత్యాచారాలు, హత్యలు అరికట్టేందుకే మహిళా సంకల్ప దీక్ష అని చెప్పారు.

ఈ దీక్షతో తమ ఉద్యమం ఆగదని, మరింత ఉద్ధృతం చేస్తామని లక్ష్మణ్​ అన్నారు. గ్రామాల్లోని గొలుసు దుకాణాలు మూసి వేయాలని డిమాండ్ చేశారు. మద్య రహిత తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

ABOUT THE AUTHOR

...view details