తెలంగాణ ప్రజలకు తెరాస, ఎంఐఎం నుండి విముక్తి కలిగించాలని భాజపా కంకణం కట్టుకుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. కార్వాన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... రాబోయే ఎన్నికల్లో తెరాసను ఓడింటే ఏకైక పార్టీ భాజపానేని స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గల్లీగల్లీకి తీసుకెళ్తామని తెలిపారు.
'గోల్కొండ ఖిల్లాపై భాజపా జెండా ఎగురవేస్తాం'
రాబోయే ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లాపై భాజపా జెండా ఎగురవేస్తామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గల్లీగల్లీకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
Laxman