తెలంగాణ

telangana

By

Published : Nov 30, 2020, 3:24 PM IST

ETV Bharat / state

మెట్రోలో ప్రయాణించిన బండి సంజయ్

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... మెట్రో రైలులో ప్రయాణించారు. అమీర్​పేట మెట్రో స్టేషన్ నుంచి నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వరకు ఆయన ప్రయాణించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మెట్రోలో ప్రయాణించిన బండి సంజయ్
మెట్రోలో ప్రయాణించిన బండి సంజయ్

కార్తిక పౌర్ణమి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. బల్కంపేట అమ్మవారి దర్శనం అనంతరం అమీర్​పేట మెట్రో స్టేషన్ నుంచి నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే వారికే ఓటు వేయాలని కోరారు.

ఇదీ చూడండి:మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details