పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇప్పటికే పలు సర్వేలు ఆ విషయాన్ని తెలుపుతున్నాయని అన్నారు. 2023లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభకు ఆయన హాజరయ్యారు.
'రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటాం' - హైదరాబాద్ తాజా వార్తలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభకు ఆయన హాజరయ్యారు.
!['రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటాం' bjp state president Bandi Sanjay said we will win two MLC positions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10913600-648-10913600-1615152746187.jpg)
'రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటాం'
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రాంచందర్ రావుకు... మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను భాజపా కైవసం చేసుకుంటుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆయన ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.
ఇదీ చదవండి: మండలి ఛైర్మన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత