తెలంగాణ

telangana

ETV Bharat / state

"TSPSC పేపర్​ లీకేజీలో ఐటీశాఖ విఫలం.. మంత్రి కేటీఆర్​ను తప్పించాలి" - టీఎస్​పీఎస్​సీపై బండి సంజయ్​ ఫైర్​

Bandi sanjay at Chanchalguda Jail: టీఎస్​పీఎస్​సీ పేపరు లీకేజీకి సంబంధించి ఐటీ శాఖ విఫలమైన దృష్ట్యా ఆ శాఖ మంత్రి కేటీఆర్​ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. సైబర్ సెక్యూరిటీ, పోలీసు వ్యవస్థ గురించి గొప్పగా మాట్లాడే మంత్రి.. ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. టీఎస్​పీఎస్​సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఆందోళనలో అరెస్టయి చంచల్​గూడ కేంద్ర కారాగారంలో ఉన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్​ను ఆయన పరామర్శించారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Mar 16, 2023, 2:20 PM IST

Bandi sanjay at Chanchalguda Jail: టీఎస్​పీఎస్​సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో ఆ కమిషన్​ను రద్దు చేసి ప్రాసిక్యూషన్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. టీఎస్​పీఎస్​సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఆందోళనలో అరెస్టయి హైదరాబాద్ చంచల్​గూడ కేంద్ర కారాగారంలో ఉన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్​ సహా ఏడుగురు యువ మోర్చా కార్యకర్తలను ఆయన పరామర్శించారు. రిమాండ్​లో ఉన్నవారందరికి సంజయ్​ ఆత్మస్థైర్యం నింపారు.

అనంతరం కారాగారం బయట సంజయ్ మీడియాతో మాడ్లాడారు. సాధారణంగా ఛైర్మన్ వద్ద ఉండాల్సిన పాస్​వర్డ్ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసులో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించకుండా సిట్ వేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. టీఎస్​పీఎస్​సీ పేపరు లీకేజ్​ సంబంధించి ఐటీ శాఖ విఫలమైన దృష్ట్యా ఆ శాఖ మంత్రి కేటీఆర్​ను తప్పించాలని బండి సంజయ్​ డిమాండ్​ చేశారు.

"ఇలాంటి తరహాలోనే వేరే మంత్రి లేదా ఎమ్మెల్యే తప్పు చేస్తే వారిని సీఎం విధులు నుంచి బయటకు పంపేవారు.. కేటీఆర్ తన కొడుకు కాబట్టే వెనకేసుకొస్తున్నారని" ఆరోపించారు. సైబర్ సెక్యూరిటీ, పోలీసు వ్యవస్థ గురించి గొప్పగా మాట్లాడే మంత్రి.. ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఈ కేసుతో తమ పార్టీకి సంబంధం ఉందని అంటగట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.'ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు.. తమ పోరాట ఆగదు.. ఎంత మందిని అరెస్టు చేసి జైళ్లకు పంపుతారో పంపండి.. మేమేం భయపడం' అని సంజయ్ ఘాటుగా హెచ్చరించారు.

Master mind behind TSPSC Paper leakage : ఇక టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తమ్ముడి పేరుతో రేణుక దంపతులు ప్రశ్నాపత్రాలు సంపాదించేందుకు తెరవెనుక పెద్ద తతంగమే నడిపట్లు పోలీసులు గుర్తించారు.

పరీక్ష రాసేందుకు విద్యా అర్హత లేని తమ్ముడిని చూపించి ముందుగానే అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని లక్షలు కాజేసేందుకు రేణుక వ్యూహరచన చేశారు. ప్రధాన నిందితుడు, కమిషన్‌ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్‌కుమార్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌ సాయంతో అసిస్టెంట్‌ ఇంజినీర్‌- సివిల్‌ ప్రశ్నాపత్రాలు తస్కరించి లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇవీ చదవండి:

TSPSC కార్యాలయం వద్ద 144 సెక్షన్.. వాటికి నో పర్మిషన్!

బండి సంజయ్ లేఖ... సానుకూలంగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్

TSPSC పేపర్ లీకేజీ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు.. మరోసారి అట్టుడికిన కమిషన్ పరిసరాలు

ABOUT THE AUTHOR

...view details