తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 2:20 PM IST

ETV Bharat / state

సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలి: కె.లక్ష్మణ్​

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన ఆయనను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలి: కె.లక్ష్మణ్​
సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించాలి: కె.లక్ష్మణ్​

భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్​ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ అశోక్​నగర్​లోని ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి పోలీసులు పహారా కాశారు. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన లక్ష్మణ్​ను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడ్​పల్లి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గొంతు విప్పే ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడా అరెస్టు చేయడం దారుణమన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు.

ఇదీ చదవండి:పటాన్​చెరులో భాజపా నాయకుల ముందస్తు అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details