దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ భాజపా నేతల భేటీ ముగిసింది. జనసేనతో కలిసి వెళ్లే రాజకీయ వ్యూహాలపై చర్చించామని ఆ పార్టీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సోమవారం రామతీర్థం వెళ్లి.. నిరసన తెలపనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.
తిరుపతిలో జనసేనతో కలిసే పోటీ: సోము వీర్రాజు - bjp on rama theertham incident
సోమవారం రామతీర్థంలో నిరసన తెలపనున్నట్లు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఏపీలో అన్ని ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
![తిరుపతిలో జనసేనతో కలిసే పోటీ: సోము వీర్రాజు రామతీర్థంలో నిరసన తెలుపుతాం: సోము వీర్రాజు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10093414-804-10093414-1609584082603.jpg)
రామతీర్థంలో నిరసన తెలుపుతాం: సోము వీర్రాజు
ఏపీ రామతీర్థంలోనే కాదు, అన్ని ఆలయాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో భాజపా-జనసేన కలిసే పోటీ చేస్తాయని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:చంద్రబాబు కొండపైకి వెళ్లేసరికి గుడికి తాళం వేసిన అధికారులు