తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2021, 4:53 PM IST

ETV Bharat / state

తిరుపతిలో జనసేనతో కలిసే పోటీ: సోము వీర్రాజు

సోమవారం రామతీర్థంలో నిరసన తెలపనున్నట్లు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఏపీలో అన్ని ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

రామతీర్థంలో నిరసన తెలుపుతాం: సోము వీర్రాజు
రామతీర్థంలో నిరసన తెలుపుతాం: సోము వీర్రాజు

దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ భాజపా నేతల భేటీ ముగిసింది. జనసేనతో కలిసి వెళ్లే రాజకీయ వ్యూహాలపై చర్చించామని ఆ పార్టీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సోమవారం రామతీర్థం వెళ్లి.. నిరసన తెలపనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.

ఏపీ రామతీర్థంలోనే కాదు, అన్ని ఆలయాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో భాజపా-జనసేన కలిసే పోటీ చేస్తాయని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:చంద్రబాబు కొండపైకి వెళ్లేసరికి గుడికి తాళం వేసిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details