రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ఆరోపించారు. మహిళలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా... ప్రభుత్వం చూసీచుడనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మద్యం అమ్మకాలపై పెట్టిన దృష్టి... మహిళల భద్రతపై పెట్టడంలేదని ఆరోపించారు. భాజపా ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తాలో 'జస్టిస్ ఫర్ దిశ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ పాల్గొన్నారు. శిల్పకళా వేదిక నుంచి మాదాపూర్ పోలీస్స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం కింద రూ.3 వేల కోట్లు కేటాయిస్తే... కనీసం రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన పేర్కొన్నారు.
'మద్యం దుకాణాలపై పెట్టిన దృష్టి భద్రతపై పెట్టట్లేదు' - BJP PARTY PROTEST AT MADHAPUR
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై సర్కారు పెట్టిన దృష్టి... మహిళా భద్రతపై పెట్టటం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ మండిపడ్డారు. భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్ సిటీలో జస్టిస్ ఫర్ దిశ కార్యక్రమం నిర్వహించారు.

BJP PARTY HELD BIG RALLY FROM HOTECHCITY TO MADHAPUR NAME OF JUSTICE FOR DISHA
'మద్యం దుకాణాలపై ప్రభుత్వం పెట్టిన దృష్టి భద్రతపై పెట్టట్లేదు'