తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2021, 1:32 PM IST

ETV Bharat / state

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామం: లక్ష్మణ్

హైద్రాబాద్​ గాంధీనగర్​లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ స్వేచ్ఛగా ఓటు వేయడం శుభపరిణామని ఆయన అన్నారు.

bjp-obc-morcha-president-laxman-casted-his-vote-at-gandhi-nagar-in-hyderabad
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామం: లక్ష్మణ్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఇరుకు గదుల్లో ఏర్పాటు చేశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ గాంధీ నగర్​లోని తూనికలు-కొలతల శాఖ భవనంలో లక్ష్మణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

విద్యావంతులు, పట్టభద్రులు, మేధావులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామమన్నారు. లక్ష్మణ్​తో పాటు ఆయన కుమారుడు, కోడలు, కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇదీ చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు

ABOUT THE AUTHOR

...view details