తెలంగాణ

telangana

By

Published : Jan 3, 2023, 5:27 PM IST

ETV Bharat / state

ఆంధ్ర ప్రజలకు కేసీఆర్​ క్షమాపణలు చెప్పాలి: బీజేపీ ఎంపీ జీవీఎల్​

BJP MP GVL TALKING ABOUT KCR BRS PARTY: ఏపీలోని విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఎంపీ జీవీఎల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలు తెలంగాణ సీఎం కేసీఆర్ తుంగలోకి తొక్కారని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పి ఇక్కడ పర్యటించాలని డిమాండ్‌ చేశారు.

BJP MP GVL
ఏపీ బీజేపీ నేత జీవీఎల్​

BJP MP GVL TALKING ABOUT KCR BRS PARTY: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఎంపీ జీవీఎల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలోకి తొక్కారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ బీఆర్​ఎస్​ పార్టీ ఒక దుర్మార్గపు పార్టీ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు. ఆంధ్రా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నకేసీఆర్ ఈ రాష్ట్రంలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పి ఇక్కడ పర్యటించాలని డిమాండ్‌ చేశారు.

బీఆర్​ఎస్​పై విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్​

ABOUT THE AUTHOR

...view details