తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు పండ్ల రసాలు అందజేసిన ఎమ్మెల్సీ - పోలీసులకు బటర్ మిల్క్​, పండ్ల రసాలను అందజేత

కరోనా కాలంలోనూ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు 6 వేల యూనిట్ల బటర్ మిల్క్​, పండ్ల రసాలను అందజేశారు.

mlc ram chander rao distributed fruit juice to police
పోలీసులకు పండ్ల రసాలు అందజేసిన ఎమ్మెల్సీ

By

Published : Jul 16, 2020, 5:10 PM IST

కొవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు భద్రత కల్పిస్తున్న పోలీస్ శాఖను భాజపా ఎమ్మెల్సీ రాం చందర్ రావు అభినందించారు. అందులో భాగంగానే తన వంతు సాయంగా సీపీ అంజనీ కుమార్​కు 6 వేల యూనిట్ల బటర్ మిల్స్, పండ్ల రసాలను అందజేశారు. వాటిని హైదరాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారికి అందజేయనున్నట్లు వివరించారు.

అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు, ప్రభుత్వ ఆసుపత్రులకు పండ్ల రసాలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్సీ రాంచందర్ రావు తెలిపారు. గతంలో కూడా వేల యూనిట్ల జ్యూస్ ప్యాకెట్లను అందజేసినట్లు ఆయన వివరించారు.

ఇవీ చూడండి:మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details