తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2020, 12:27 PM IST

Updated : Oct 27, 2020, 12:46 PM IST

ETV Bharat / state

గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్

హైదరాబాద్​లో గోషామహాల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు. దుబ్బాక గెలుపు కోసం తెరాస ఎంతటి దారుణానికైనా పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. భాజపా నిజాయతీ గల పార్టీ అని చెప్పారు. ఇప్పుడైనా దుబ్బాక ప్రజలు మేలుకోవాలని కోరారు.

bjp mla raja singh house arrest in Hyderabad
ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్

హైదరాబాద్​లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్​​ను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు. దుబ్బాక సీటును ఎట్టి పరిస్థితిలో గెలవాలనే ఉద్దేశంతో తెరాస నాయకులు ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా బండి సంజయ్​తో వ్యవహరించారని విమర్శించారు.

తాము అనుకుంటే ఏదైనా చేస్తామని... కానీ భాజపా నిజాయతీతో నడిచే పార్టీ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా దుబ్బాక ప్రజలు మేలు కోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.

గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్

ఇదీ చదవండి:దీక్ష కొనసాగిస్తున్న బండి సంజయ్​.. ప్రగతిభవన్​ వద్ద భారీగా బలగాలు

Last Updated : Oct 27, 2020, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details