తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2022, 2:16 PM IST

ETV Bharat / state

సీజేఐ జస్టిస్‌ రమణకు ఎమ్మెల్యే రఘునందన్‌రావు లేఖ.. ఎందుకంటే?

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌పై వేసిన రిట్‌ పిటిషన్‌.. హైకోర్టు ముందుకు రావడం లేదనే విషయంపై సీజేఐకు లేఖ రాశారు.

Bjp mla raghunandan rao on cs somesh kumar
Bjp mla raghunandan rao on cs somesh kumar

సీజేఐ జస్టిస్‌ రమణకు ఎమ్మెల్యే రఘునందన్‌రావు లేఖ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌పై వేసిన రిట్‌ పిటిషన్‌ ఐదేళ్లు గడుస్తున్నా.... హైకోర్టు బెంచ్‌ ముందుకు ఎందుకు రావడం లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. విచారణకు రాకుండా తొక్కి పెడుతున్నది ఎవరు... చీఫ్‌ జస్టిస్‌ ముందుకు రాకుండా ఎందుకు ఆగిందో తెలియాలన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాశారు.

'' సీఎస్‌పై వేసిన రిట్‌ పిటిషన్‌ బెంచ్‌ ముందుకు ఎందుకు రావట్లేదు. ఐదేళ్లు గడుస్తున్నా హైకోర్టు బెంచ్‌ ముందుకు ఎందుకు రావట్లేదు. రిట్ పిటిషన్‌ విచారణకు రాకుండా తొక్కిపెడుతున్నది ఎవరు? ఈ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రమణకు లేఖ రాశాను.''

- రఘునందన్‌రావు, భాజపా ఎమ్మెల్యే


సోమేశ్‌ కుమార్‌ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారి అని రఘునందన్‌రావు తెలిపారు. ఆయనతో పాటు మరో 12 మంది అధికారులు కూడా ఆంధ్రకు కేటాయించిన అధికారులేనని వారంతా... నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో కొనసాగుతున్నారని అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details