తెలంగాణ

telangana

లుకౌట్‌ నోటీసుల పేరుతో ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది: రాంచందర్​ రావు

Ramchander Rao on Buying TRS MLAs Issue: సిట్ కేసులో బీజేపీ నాయకులకు లుకౌట్ నోటీసుల పేరుతో టీఆర్​ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు ధ్వజమెత్తారు. చౌకబారు రాజకీయాలు చేస్తే భాజపా భయపడదని పేర్కొన్నారు. టీఆర్​ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించారు.

By

Published : Nov 22, 2022, 4:04 PM IST

Published : Nov 22, 2022, 4:04 PM IST

Ramchander Rao
Ramchander Rao

Ramchander Rao on Buying TRS MLAs Issue: సిట్‌ కేసులో బీజేపీ నాయకులకు లుకౌట్ నోటీసులిచ్చారని... అసత్య ప్రచారాలు చేస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆరోపించారు. లుకౌట్ నోటీసులకు ఎం.హెచ్.ఎ కొన్ని గైడలెన్స్​లు ఉన్నాయని తెలిపారు. లుకౌట్ నోటిసులపై తెరాస తప్పుడు సమాచారం ఇస్తుందని ఆయన మండిపడ్డారు.

టీఆర్​ఎస్ నాయకుడు రావుల శ్రీధర్, తెరాస సామాజిక మాధ్యమాల ప్రతినిధి సతీష్ రెడ్డి అనే వ్యక్తులకు ఏం అధికారం ఉందని లుకౌట్ నోటీసుల గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఫేక్ న్యూస్​పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్పందించాలని కోరారు. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకొని... నిక్షిప్తంగా దర్యాప్తు చేయాలని రాంచందర్​రావు డిమాండ్ చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తారనే నెపంతోనే సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. తెరాస ఎన్ని చౌకబారు రాజకీయాలు చేసిన తమ పార్టీ దీటుగా ఎదుర్కొంటుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details