తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2021, 2:10 PM IST

Updated : Nov 13, 2021, 3:26 PM IST

ETV Bharat / state

BJP leader Laxman: ఆ వివరాలను తెరాస ఎందుకు బయట పెట్టట్లేదు?: లక్ష్మణ్‌

తెలంగాణలో బీసీలు రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేస్తున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్(BJP OBC Morcha national president Laxman)​ ఆరోపించారు. ఆలె భాస్కర్ అధ్యక్షతన హైదరాబాద్​లో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్​తో కలిసి లక్ష్మణ్ పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేసిన తెరాస సర్కారు.. వివరాలను ఎందుకు బయటపెట్టడంలేదని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలను అణిచివేస్తున్నారని.. బీసీల సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

obc morcha state executive committee meeting
భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం

బలహీనవర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌(BJP OBC Morcha national president Laxman)​ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా దక్కిందని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ(OBC morcha state executive committee meeting) సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)తో కలిసి ఆయన(BJP OBC Morcha national president Laxman)​ పాల్గొన్నారు.

బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: లక్ష్మణ్​

40సంవత్సరాలకు పైగా ఒకే కుటుంబం దేశాన్ని పాలించి.. బీసీలకు అనువైన ఒక్క నిర్ణయం తీసుకోలేదు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్​కు లేదు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది కాంగ్రెస్ పార్టీ. కులాల వారీగా బంధు డిమాండ్ చేయాల్సిన అవసరం ఓబీసీ మోర్చా మీద ఉంది. -లక్ష్మణ్​, భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు

బీసీల వర్గీకరణ కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం జస్టిస్ రోహిణీ కమిషన్ ఏర్పాటు చేశారని లక్ష్మణ్(BJP OBC Morcha national president Laxman)​ ​ అన్నారు. ఈ ఏడాది 70వేల మంది ఓబీసీ విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయాల్లో అవకాశం దక్కిందని చెప్పారు. 52మంత్రిత్వ శాఖలు, 300కు పైగా ప్రవేశపెట్టిన పథకాల అమలుకు ఓబీసీ మోర్చా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు.

అణచి వేస్తున్నారు

సమగ్ర కుటుంబ సర్వే చేసిన తెరాస సర్కార్‌ వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని లక్ష్మణ్‌(BJP OBC Morcha national president Laxman)​ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలను రాజకీయంగా అణిచి వేస్తున్నారన్న లక్ష్మణ్‌.... బీసీల సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలంటే 50శాతం ఉన్న బీసీలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:YS Sharmila hunger strike : 'పంట మార్పిడి అంటే మంత్రులను మార్చినంత సులభమా?'

Last Updated : Nov 13, 2021, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details