ఈ నెల 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్లో బైక్ రైడర్స్ అవగాహనా ర్యాలీ నిర్వహించారు. హ్యార్లీ డేవిడ్సన్, గ్రీటింగ్స్ ఫ్రమ్ సీఐఐ యంగ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైలం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. దేశవ్యాప్తంగా నాలుగు వందల మంది అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసినట్లుగానే శరీరంలోని అవయవాలను దానం చేయడంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేస్తామన్నారు.
అవయవదానంపై బైక్ రైడర్స్ అవగాహన ర్యాలీ - అవయవదానంపై బైక్ రైడర్స్ అవగాహన ర్యాలీ
హ్యార్లీ డేవిడ్సన్, గ్రీటింగ్స్ ఫ్రమ్ సీఐఐ యంగ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో అవయవ దానంపై బైక్ రైడర్స్ హైదరాబాద్లో అవగాహనా ర్యాలీ నిర్వహించారు.
![అవయవదానంపై బైక్ రైడర్స్ అవగాహన ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4103428-thumbnail-3x2-vysh.jpg)
అవయవదానంపై బైక్ రైడర్స్ అవగాహన ర్యాలీ