డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న క్షేత్ర సహాయకుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. 7,610 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ కారణంతోనే 21 మంది క్షేత్రసహాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం' - ప్రెస్క్లబ్లో ఫీల్డ్అసిస్టెంట్ల సమావేశం
ఉద్యమాలతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఉద్యమాలను చిన్న చూపు చూడటం తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హితవు పలికారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
!['స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం' 'మీరు స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9877415-thumbnail-3x2-krishnayya-rk.jpg)
'మీరు స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం'
ఇప్పటివరకు ఈ ఉద్యమాన్ని తాము రాజకీయం చేయలేదని కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెర తీస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:'పంచాయతీరాజ్ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేస్తోంది'