తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం' - ప్రెస్​క్లబ్​లో ఫీల్డ్​అసిస్టెంట్ల సమావేశం

ఉద్యమాలతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఉద్యమాలను చిన్న చూపు చూడటం తగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హితవు పలికారు. హైదరాబాద్ బషీర్​బాగ్​లోని ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

'మీరు స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం'
'మీరు స్పందించకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెరతీస్తాం'

By

Published : Dec 14, 2020, 7:01 PM IST

డిమాండ్ల సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న క్షేత్ర సహాయకుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. 7,610 మంది ఫీల్డ్ అసిస్టెంట్​లను విధుల నుంచి తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆ కారణంతోనే 21 మంది క్షేత్రసహాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఈ ఉద్యమాన్ని తాము రాజకీయం చేయలేదని కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకపోతే రాజకీయపరమైన ఉద్యమానికి తెర తీస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:'పంచాయతీరాజ్​ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేస్తోంది'

ABOUT THE AUTHOR

...view details