తెలంగాణ

telangana

ETV Bharat / state

'పూలే ఆశయాల సాధనకోసం విద్యార్థులు కృషి చేయాలి' - Bc Students Federation conducted mahatma jyotiba phule Death anniversary

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని షాద్​నగర్​ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​  కొనియాడారు.

Bc Students Federation conducted mahatma jyotiba phule Death anniversary
Bc Students Federation conducted mahatma jyotiba phule Death anniversary

By

Published : Nov 28, 2019, 10:51 PM IST

బడుగు బలహీన వర్గాలకు విద్యనందించాలనే లక్ష్యంతో తన 14వ ఏటానే విద్యా సంస్థను ఏర్పాటు చేసి... పేదలకు విద్యనందించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని షాద్​నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో బీసీ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సభకు హాజరయ్యారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువకులంతా మంచి మార్గాన్ని ఎంచుకొని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఈ సభకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి తదితరులు హాజయ్యారు.

'పూలే ఆశయాల సాధనకోసం విద్యార్థులు కృషి చేయాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details