తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటలపై అసత్య ప్రచారం తగదు: బీసీ సంఘాలు - తెలంగాణ వార్తలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్​కు బీసీ మంత్రులు మద్దుతుగా నిలవాలని బీసీ సంఘాల నేతలు కోరారు. ఈటలపై అసత్య ప్రచారం చేసిన మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్​బాగ్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు.

BC communities protest at bhasheerbagh, hyderabad bc communities strike
ఈటల రాజేందర్​కు మద్దతుగా బీసీ సంఘాలు, బీసీ సంఘాల ధర్నా

By

Published : May 5, 2021, 4:00 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్​పై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే ఈటల రాజేందర్​కు క్షమాపణ చెప్పాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్​బాగ్ కూడలి వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రచాల యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మంత్రులతో ఈటలపై అసత్య ఆరోపణలు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాష్ట్రంలో 5.5 శాతం ఉన్న అగ్రకులాల నాయకులు ముఖ్యమంత్రి అవగా... సగభాగం ఉన్న బీసీలు ముఖ్యమంత్రి అవకూడదా? అంటూ యుగేందర్ గౌడ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీలకు ద్రోహం చేయకుండా బీసీ మంత్రులు ఈటలకు మద్దతు పలకాలని కోరారు. అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. బీసీలు ఏకమై కొత్త రాజకీయ పార్టీని పెడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:వెంటిలేటర్ల కొరత... ప్రభుత్వాస్పత్రిలో నలుగురు మృతి !

ABOUT THE AUTHOR

...view details