తెలంగాణ

telangana

బీసీ కమిషన్​ పునరుద్ధరించాలని హెచ్​ఆర్సీలో ఫిర్యాదు

By

Published : Apr 30, 2021, 10:25 AM IST

రాష్ట్రంలో బీసీ కమిషన్​ను పునరుద్ధరించాలని సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్​ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్​లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఆశ్రయించారు. కమిషన్​ ఏర్పాటయ్యేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

BC commission state secretary complaint o hrc
మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించిన బీసీసంఘం నేతలు

బీసీ కమిషన్​ ఏర్పాటు పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ ఆరోపించారు. తక్షణమే కమిషన్​ ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని హైదరాబాద్​లోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. 16 నెలలుగా కమిషన్ లేకపోవడంతో తమ బాధలు చెప్పుకోలేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం కమిషన్​కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తీవ్రంగా విమర్శించారు. బీసీల పట్ల చిన్నచూపు చూస్తూ అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని విడనాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ప్రశాంతంగా కొనసాగుతోన్న మినీ పుర ఎన్నికల ఓటింగ్

ABOUT THE AUTHOR

...view details