న్యాయవాద దంపతుల హత్యలపై నిష్పాక్షిక, స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని బార్కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పోలీసులు నిష్పాక్షికమైన దర్యాప్తు చేసే పరిస్థితి లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సీనియర్ అడ్వొకేట్ మనన్కుమార్ మిశ్రా ఓ ప్రకటన విడుదల చేశారు.
మంథని కస్టోడియల్ మరణంపై పిల్ దాఖలు చేయడంతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకుడికి వ్యతిరేకంగా కేసులు వాదిస్తున్నందుకే ఈ భయంకరమైన దాడి జరిగినట్లు దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు. స్వతంత్ర న్యాయవిచారణ జరిపించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లికి లేఖ రాయాలని బార్ కౌన్సిల్ తీర్మానించింది.