తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు మొదలైన సహాయక చర్యలు - విశాఖ తీరంలో బంగ్లాదేశ్​ నౌక

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు కోస్ట్​గార్డ్​ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. ముందుగా విద్యుత్​ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.

bangladesh-ship-rescue-operations-started-in-visakha-coastal-area
ఏపీ: బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు మొదలైన సహాయక చర్యలు

By

Published : Oct 16, 2020, 3:26 PM IST

ఏపీలోని విశాఖ సాగర తీరంలోని తెన్నేటి పార్కు సమీపంలోకి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక నుంచి ఇంధనం తీసివేసేందుకు నిపుణులు సన్నాహాలు ప్రారంభించారు. ముందుగా విద్యుత్​ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు.

ఇందుకోసం సామాగ్రిని చేరవేసేందుకు వాహనం వెళ్లేలా జేసీబీతో పనులు చేయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో మునిగిన లాంచీని వెలికి తీసిన బృందం కూడా సహాయమందించేందుకు సిద్ధమైంది.

ఇదీ చదవండి: త్రీడీ వీడియోలు చూసిన అనుభవం రెండు ప్రాణాలను కాపాడింది

ABOUT THE AUTHOR

...view details