ఏపీలోని విశాఖ సాగర తీరంలోని తెన్నేటి పార్కు సమీపంలోకి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌక నుంచి ఇంధనం తీసివేసేందుకు నిపుణులు సన్నాహాలు ప్రారంభించారు. ముందుగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు.
ఏపీ: బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు మొదలైన సహాయక చర్యలు - విశాఖ తీరంలో బంగ్లాదేశ్ నౌక
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ తీరానికి కొట్టుకు వచ్చిన బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు కోస్ట్గార్డ్ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. ముందుగా విద్యుత్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు.

ఏపీ: బంగ్లాదేశ్ నౌకను తిరిగి పంపేందుకు మొదలైన సహాయక చర్యలు
ఇందుకోసం సామాగ్రిని చేరవేసేందుకు వాహనం వెళ్లేలా జేసీబీతో పనులు చేయిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో మునిగిన లాంచీని వెలికి తీసిన బృందం కూడా సహాయమందించేందుకు సిద్ధమైంది.
ఇదీ చదవండి: త్రీడీ వీడియోలు చూసిన అనుభవం రెండు ప్రాణాలను కాపాడింది