హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని( Huzurabad by election 2021) ముమ్మరం చేశాయి. హుజూరాబాద్లోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... తెరాసపై విమర్శలు చేశారు. దళితబంధు నిలిపివేతపై తెరాస అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో( Huzurabad by election 2021) ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెరాస వాళ్లే లేఖ రాసి.. పథకాలు ఆపి.. భాజపాపై నెపం వేస్తారు. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ పేరు చెప్పి ఆపుతారు. దళితబంధు నిధులు ఖాతాల్లో వేసి విత్డ్రా చేసుకోనివ్వలేదు. దళితబంధు నిధులు ఇవ్వాలని భాజపా డిమాండ్ చేస్తోంది. దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు సీఎం నిరూపిస్తారా? యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. అని బండి సంజయ్ అన్నారు.
గ్రామాల్లో చేపట్టే ప్రతి పనికి కేంద్రం నిధులు ఇస్తోంది. రైతువేదికలు, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనానికి కేంద్రం నిధులు ఇస్తోంది. దళితబంధు నిలిపివేతపై తెరాస అబద్ధాలు చెప్తోంది. తెరాస వాళ్లే లేఖ రాసి, పథకాలు ఆపి, భాజపాపై నెపం వేస్తారు. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ పేరు చెప్పి ఆపుతారు. దళితబంధు నిధులు ఖాతాల్లో వేసి, విత్డ్రా చేసుకోనివ్వలేదు. దళితబంధు నిధులు ఇవ్వాలని భాజపా డిమాండ్ చేస్తోంది. దళితబంధు ఆపాలని నేను లేఖ రాసినట్లు సీఎం నిరూపిస్తారా? యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణానికి కేసీఆర్ సిద్ధమా?. నాగార్జుసాగర్ ఎన్నిక తర్వాత గొర్రెల పంపిణీ పథకం ఆగిపోయింది.