తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం కేసీఆర్​కు లేదా?' - బండి సంజయ్ వార్తలు

Bandi Sanjay about employees transfers : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని... జీవో 317ను సవరించాలని గవర్నర్‌ను కోరామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం సీఎం కేసీఆర్‌కు లేదని సంజయ్ ఆరోపించారు. ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

Bandi Sanjay about employees transfers, bjp leaders met governor
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు

By

Published : Dec 31, 2021, 12:07 PM IST

Bandi Sanjay about employees transfers : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. జీవో 317ను సవరించాలని కోరుతూ గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు వినతిపత్రం అందించారు. ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం సీఎం కేసీఆర్‌కు లేదని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 41 నెలలు దాటినా ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

జీవో 317ను వ్యతిరేకించట్లేదు.. సవరించాలనే కోరుతున్నాం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. జీవో 317ను సవరించాలని గవర్నర్‌ను కోరాం. ఉద్యోగుల ఇబ్బందులు తెలుసుకునే సమయం కూడా లేదా? .రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 41 నెలలు దాటింది. ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారు. సకల జనుల సమ్మె వల్లే తెలంగాణ సాకారమైంది. ఉద్యోగుల వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు.

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఉద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సంజయ్ కోరారు.జీవోను సవరించే వరకు బదిలీల ప్రక్రియను ఆపేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరాశ చెందొద్దన్న సంజయ్... భాజపా అండగా ఉంటుందని చెప్పారు. సీఎం వైఖరిలో మార్పు వచ్చేవరకు ఆందోళన చేస్తామన్నారు. జీవో విషయంలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని బండి సంజయ్ వెల్లడించారు.

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన భాజపా నేతలు

సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులపై కక్ష తీర్చుకుంటున్నారు. ఒక జిల్లా ఉద్యోగులు మరో జిల్లాకు ఎలా వెళ్తారు? స్పౌస్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లను, దివ్యాంగులైన ఉద్యోగుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉద్యోగుల విషయంలో కేసీఆర్ మానవతా దృక్పథంతో వ్యవహరించాలి.

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:Road accidents in telangana 2021 : ఈ ఏడాదిలో రక్తసిక్తమైన రహదారులు.. పెరిగిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details