తెలంగాణ

telangana

ETV Bharat / state

నియంత్రిత సాగు పేరుతో రైతులపై బెదిరింపులా..?: బండి సంజయ్​

రాష్ట్రంలో నియంత్రిత సాగు పేరుతో రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు.

By

Published : Jun 20, 2020, 7:01 PM IST

bandisanjay-patricipate-jan-sanvad-virtual-rally-at-bjp-state-office-in-hyderabad
నియంత్రిత సాగు పేరుతో రైతులను బెదిరిస్తున్నారు: బండి సంజయ్​

కరోనా పరీక్షలు చేయకుండా రాష్ట్ర ప్రజల ప్రాణాలతో తెరాస ప్రభుత్వం ఆడుకుంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. నియంత్రిత సాగు పేరుతో రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర కార్యాలయంలో జన్‌ సంవాద్‌ వర్చువల్‌ ర్యాలీలో పార్టీ అధ్యక్షుడితో పాటు ఎంపీలు పాల్గొన్నారు. దిల్లీలో జేపీ నడ్డా, కిషన్‌ రెడ్డి జన్‌సంవాద్‌ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రం రెండు కుటుంబాల చేతిలోనే నడుస్తోందని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details