తెలంగాణ

telangana

ETV Bharat / state

"సమానత్వంపై మాట్లాడుతున్న కేసీఆర్​.. మోదీని ఎందుకు అడగలేదు.?" - kcr not attended PM Visit

Bandi Sanjay Comments on KCR: రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారంటే కేసీఆర్​కు జ్వరం వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఎద్దేవా చేశారు. ప్రైవేటు కార్యక్రమమైనా.. ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రధానికి స్వాగతం పలకాల్సిన కనీస బాధ్యత ముఖ్యమంత్రికి ఉందని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్​ పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు.

bandi sanjay fired on kcr
కేసీఆర్​పై బండి సంజయ్​ ఫైర్​

By

Published : Feb 6, 2022, 1:27 PM IST

Bandi Sanjay Comments on KCR: సమానత్వం గురించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్.. ఏడేళ్లుగా ప్రధాని మోదీని ఎందుకు అడగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి స్వాగతం పలకాల్సిన కనీస బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్న స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం పనుల పురోగతిని బండి సంజయ్​ పరిశీలించారు. శనివారం హైదరాబాద్​ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని కేసీఆర్​ కలసి సమానత్వం గురించి మాట్లాడాల్సిందని హితవు పలికారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారంటే కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు.

అది కనీస బాధ్యత

"ప్రైవేటు కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రధానికి స్వాగతం పలకాల్సిన కనీస బాధ్యత సీఎం కేసీఆర్​కు లేదా.?. దళితుడిని సీఎం చేస్తా అని కేసీఆర్ మోసం చేశారు. సమానత్వం గురించి మాట్లాడుతున్న కేసీఆర్.. ఇన్ని రోజులు ప్రధానిని ఎందుకు అడగలేదు.? కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చాయి. కానీ దళితులకు ఏం ఇచ్చారు.?" -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

అందుకే దళిత బంధు

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతామని కేసీఆర్ 2016లో చెప్పారని బండి సంజయ్​ గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ పనులు పునాదుల దగ్గరే ఉన్నాయని విమర్శించారు. ఈ విగ్రహం పూర్తి కావాలంటే మరో 5 ఏళ్లు పట్టేలా ఉందని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి వేడుకలను కేసీఆర్ మర్చిపోయారని బండి సంజయ్​ ఆరోపించారు. విగ్రహ పనులను కేసీఆర్ ఎందుకు పరిశీలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని.. వారికి ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తారనే భయంతో దళిత బంధు తెరపైకి తెచ్చారన్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్నే తిరగరాయాలంటున్నారని బండి సంజయ్​ వ్యాఖ్యానించారు.

ప్రధానికి ఎందుకు స్వాగతం పలకలేదు: బండి సంజయ్‌

ఇదీ చదవండి:TRS and BJP Tweet War : తెరాస, భాజపా ట్విటర్​ వార్​.. ట్రెండింగ్​లో 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ'

ABOUT THE AUTHOR

...view details