తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రం పోరాడి సాధించుకున్నది, అడిగి తెచ్చుకున్నది కాదు'

హైదరాబాద్ లోయర్ ట్యాంక్​బండ్​లోని పింగళి వెంకట రామిరెడ్డి హాలులో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

By

Published : Sep 15, 2019, 6:22 PM IST

'రాష్ట్రం పోరాడి సాధించుకున్నది, అడిగి తెచ్చుకుంది కాదు'

తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్నదని, అడిగి తెచ్చుకుంది కాదని హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్​బండ్​లోని పింగళి వెంకట రామిరెడ్డి హాలులో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు రాలేదని రాజకీయాలకు అతీతంగా జరిగిన పోరాటమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి స్కిల్ డెవలప్​మెంట్ అవసరమని ఆయన అన్నారు. ప్రతి పొలానికి గోదావరి జలాలు అందాలని తెలిపారు. ఆత్మహత్యలు లేని తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

'రాష్ట్రం పోరాడి సాధించుకున్నది, అడిగి తెచ్చుకున్నది కాదు'

ABOUT THE AUTHOR

...view details