తెలంగాణ

telangana

ETV Bharat / state

నౌహీరా షేక్​ను అదుపులోకి తీసుకున్న బళ్లారి పోలీసులు - ballary

హీరా గ్రూప్​ సంస్థల ఎండీ నౌహీరాషేక్​ను బళ్లారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నమోదైన కేసులో దర్యాప్తు కోసం ఆమెను చంచల్​గూడ మహిళా జైలు నుంచి ఇవాళ తీసుకెళ్లారు.

నౌహీరా షేక్​

By

Published : Jul 10, 2019, 10:35 PM IST

Updated : Jul 10, 2019, 10:49 PM IST

నౌహీరా షేక్​ను అదుపులోకి తీసుకున్న బళ్లారి పోలీసులు

కర్ణాటక పోలీసులు హీరా గ్రూప్​ సంస్థల ఎండీ నౌహీరా షేక్​ను అదుపులోకి తీసుకున్నారు. బళ్లారీలో నమోదైన కేసు విచారణకు ఆమెను చంచల్​గూడ మహిళా జైలు నుంచి కర్ణాటక తీసుకెళ్లారు. నాంపల్లి న్యాయస్థానంలో పీటీ వారెంట్ సమర్పించి న్యాయస్థానం అనుమతి మేరకు హీరాను తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం బళ్లారి తీసుకెళ్లారు. బంగారంలో పెట్టుబడులు పెడితే... అధిక వడ్డీ ఇస్తామని నౌహీరా షేక్.. మదుపుదార్లను కోట్ల రూపాయల్లో మోసం చేశారు. లక్ష మందికిపైగా మదుపుదారుల నుంచి 6 వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి కూడానిధులు సమీకరించినట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ముంబయి, ఢిల్లీలోనూ నౌహీరా షేక్​పై కేసులు నమోదయ్యాయి.

Last Updated : Jul 10, 2019, 10:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details