తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్యాన్సర్​పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి'

క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి అత్యాధునిక 3డీ మామ్మోగ్రఫీ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యంత్రాన్ని హిందూపూర్​ ఎమ్మెల్యే, ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ​ ప్రారంభించారు.

By

Published : Jul 13, 2019, 9:38 PM IST

3DMAMOGRAM

భారతదేశంలోనే అత్యాధునిక సాంకేతికతో కూడిన 3డీ మామ్మోగ్రామ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మొదటి ఆస్పత్రి బసవతారకం ఇండో అమెరికన్ కావటం విశేషమన్నారు ఆస్పత్రి ఛైర్మన్​, హిందూపూర్​ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నాణ్యమైన క్యాన్సర్ స్క్రీనింగ్​తో పాటు.... బయాప్సి, వాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సి, సింథసైజ్డ్ వ్యూ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్​ని కలిగి ఉందని తెలిపారు. భవిష్యత్తులో మరికొన్ని సరికొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా.. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కావాల్సిన అన్ని రకాల సహకారాన్ని బసవతారకం అందిస్తుందని బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్​పై ప్రజల్లో మరింతా అవగాహన పెంచాలని ఆస్పత్రి మేనేజింగ్​ ట్రస్టీ కోడెల శివప్రసాద రావు సూచించారు.

'క్యాన్సర్​పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి'

ABOUT THE AUTHOR

...view details