తెలంగాణ

telangana

పారిశుద్ధ్య కార్మికులకు శేఖర్​ కమ్ముల సాయం

By

Published : Apr 27, 2020, 1:25 PM IST

హైదరాబాద్​ న​గరపాలక సంస్థ నార్త్​ జోన్​ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​తో కలిసి సినీ దర్శకుడు శేఖర్​ కమ్ముల, పారిశుద్ధ్య సిబ్బందికి బాదం పాలు పంపిణీ చేశారు. కార్మికులను గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

sekhar kammula
బాదం పాలు పంపిణీ చేసిన శేఖర్​ కమ్ముల

కరోనా వైరస్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్​ఎంసీ నార్త్ జోన్ మున్సిపల్ కార్యాలయంలో సినీ దర్శకుడు శేఖర్​ కమ్ములతో కలిసి మంత్రి.. పారిశుద్ధ్య సిబ్బందికి బాదం పాలు పంపిణీ చేశారు.

కుటుంబాలను సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. ప్రజల ఆరోగ్య కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించి.. ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.

ఇవీచూడండి:సుజల దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో సాక్షాత్కారం: కేటీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details